క్రైమ్/లీగల్

పంట నీట మునిగిందని రైతు దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడుతూరు, సెప్టెంబర్ 20: వరద నీటిలో పంట పొలం మునడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రైతు జయరామిరెడ్డి(54), శేషమ్మ(49) గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మిడుతూరు మండలం పి.లింగాపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వృద్ధ రైతు జయరామిరెడ్డి(54) తన 4 ఎకరాల పొలంతో పాటు మరికొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పంటలు సరిగా పండకపోవడంతో అప్పు పెరుగుతూ వచ్చింది. ఈసారి మరోసారి అప్పుచేసి పంట సాగు చేశాడు. అయితే గత నాలుగురోజులుగా కురిసిన వర్షాలకు వాగులు పొంగడంతో వరద ముంచెత్తింది. దీంతో పంట అంతా నీట మునిగింది. గురువారం ఇది గమనించిన జయరామిరెడ్డి తీవ్ర మనస్థాపానికి గురై భార్యతో కలిసి రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.