బిజినెస్

ఇటిఎఫ్‌లలో ఇపిఎఫ్‌ఒ పెట్టుబడులు పెంచం: దత్తాత్రేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: ఎక్స్‌చేంజ్ ట్రేడ్ ఫండ్స్ (ఇటిఎఫ్)లో ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్‌ఒ) పెట్టుబడులను పెంచే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఇటిఎఫ్‌లలో 5 శాతం పెట్టుబడులకే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి), ఇపిఎఫ్ అనుమతించినట్లు లోక్‌సభకు సోమవారం ఓ లిఖితపూర్వక సమాధానంగా మంత్రి తెలిపారు. కాగా, ఆదివారం హైదరాబాద్‌లో పిటిఐతో మాట్లాడుతూ గత నెల జూన్ 30 నాటికి అటు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీకి చెందిన ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్)ల్లో ఇపిఎఫ్‌ఒ పెట్టిన పెట్టుబడుల విలువ 7,468 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ పెట్టుబడులపై 7.45 శాతం లాభాలు వచ్చాయని, ఈ మొత్తం విలువ ఇప్పుడు 8,024 కోట్ల రూపాయలుగా ఉందన్నారు. అయతే ఈ నెల 22లో గా సిబిటి సమావేశం జరగనుందని, అందు లో ఇటిఎఫ్‌లలో పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించి బాంబే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లతోనూ చర్చలు జరుపుతున్నట్లు చెప్పా రు. కానీ ఇప్పుడిలా అనడం గమనార్హం.