బిజినెస్

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం మరోసారి పెరిగాయి. ఇలా పెరగడం గడచిన రెండు నెలల్లో ఐదోసారి కావడం గమనార్హం. ఇక లీటర్ పెట్రోల్ ధర రూ. 1.34, డీజిల్ ధర రూ. 2.37 ఎగిసింది. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 66.05లకు చేరగా, డీజిల్ ధర రూ. 55.26లను తాకింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా 15 రోజులకోసారి చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయన్నది తెలిసిందే.