31వరకు రైళ్లు రద్దు
Published Monday, 23 March 2020విజయవాడ (రైల్వేస్టేషన్), మార్చి 22: కరోనా వైరస్ కారణంగా ఆదివారం అర్ధరాత్రి 12గంటల నుంచి ఈ నెల 31వరకు భారతీయ రైల్వే అంతటా రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే పౌర సంబంధాల ప్రధానాధికారి సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ని నివారించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒకరోజు జనతా కర్ఫ్యూని దేశమంతటా పాటించడంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో సైతం ఎవరికి వారుగా పూర్తిస్థాయిలో స్పందించారు. ఇందులో భాగంగానే దూర ప్రాంతాలకు నడిచే రైళ్లు మినహా మిగిలిన సూపర్ఫాస్ట్, ఇంటర్ సిటీ, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఆదివారం ఒక్కరోజు రద్దుచేశారు.