ఐటి రంగాన్ని విస్తరిస్తాం
Published Wednesday, 30 August 2017హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ ఐటి రంగం దేశంలో అగ్రగామిగా దూసుకుపోతోందని, ఐటి రంగం తన కార్యకలాపాలను విస్తరిస్తోందని, రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన నూతన ఐటి విధానం, ప్రోత్సాహకాలకు అనేక బహుళ జాతి కంపెనీలు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. మంగళవారం ఇక్కడ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజస్ అసోసియేషన్ (హైసీ) వార్షిక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటి ఉత్పత్తుల ఎగుమతులు 87 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయన్నారు. ఐటి రంగం అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా ఉందన్నారు.