‘జనతా కర్ఫ్యూ’ సంపూర్ణం
Published Monday, 23 March 2020విజయవాడ పశ్చిమ, మార్చి 22: కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించాలని స్వయంగా భారత ప్రధాని జనతా కర్ఫ్యూకి ఇచ్చిన పిలుపుమేరకు ప్రజలు విజయవంతం చేశారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి సహకరించారు. ప్రముఖ వ్యాపార స్థావరాలు సైతం మూతబడ్డాయి. రాజకీయ అలజడులు ప్రతిపక్షాలు నిర్వహించే భారత్ బంద్లు సైతం గతంలో అసంపూర్తిగా జరిగాయి. కరోనాని నియంత్రించాలని భారతీయుల్లో, రాష్ట్ర ప్రజల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలంతా ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూని పాటించారు. అధికార, ప్రతిపక్షాలు, రాజకీయాలకు అతీతంగా భారతీయుల భవిత, ప్రాణరక్షణ కోసం అందరూ భాగస్వాములయ్యారు.