S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జనతా కర్ఫ్యూ’ సంపూర్ణం

విజయవాడ పశ్చిమ, మార్చి 22: కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించాలని స్వయంగా భారత ప్రధాని జనతా కర్ఫ్యూకి ఇచ్చిన పిలుపుమేరకు ప్రజలు విజయవంతం చేశారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి సహకరించారు. ప్రముఖ వ్యాపార స్థావరాలు సైతం మూతబడ్డాయి. రాజకీయ అలజడులు ప్రతిపక్షాలు నిర్వహించే భారత్ బంద్‌లు సైతం గతంలో అసంపూర్తిగా జరిగాయి. కరోనాని నియంత్రించాలని భారతీయుల్లో, రాష్ట్ర ప్రజల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలంతా ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూని పాటించారు. అధికార, ప్రతిపక్షాలు, రాజకీయాలకు అతీతంగా భారతీయుల భవిత, ప్రాణరక్షణ కోసం అందరూ భాగస్వాములయ్యారు.

కమిషనరేట్ పరిధిలో ‘కరోనా’ ఆంక్షలు

విజయవాడ (క్రైం), మార్చి 22: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావంతో నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో తీవ్ర ఆంక్షలు విధించారు. నగరంలోని ఓ యువకుడికి కరోనా వైరస్ సోకడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే నగరంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో మరింత ఆందోళన ప్రజల్లో నెలకొంది. కరోనా వైరస్‌ను నియంత్రించే క్రమంలో తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రధాని పిలుపు మేరకు ఒకరోజు జనతా కరోనాకు కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది.

స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 22: కరోనా వైరస్ నియంత్రణకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ నగరంలో విజయవంతమైంది. నగర వ్యాప్తంగా ప్రజలందరూ కర్ఫ్యూని పాటిస్తూ ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నిర్విఘ్నంగా జరిగిన జనతా కర్ఫ్యూలో భాగంగా అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు మూతపడ్డాయి. తెల్లవారుఝామునే ఆదివారం ప్రార్థనలు ముగించుకున్న క్రైస్తవులు కరోనా నియంత్రణ కోసం మళ్లీ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. 14 గంటల జనతా కర్ఫ్యూతో ఇంటికే పరిమితమైన ప్రజానీకం తమ కుటుంబ సభ్యులతో సంతోష, ఆనందాల మధ్య కాలక్షేపం చేశారు.

31 వరకు లాక్ డౌన్

లబ్బీపేట, మార్చి 22: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా అంతటా 31 వరకు 144 సెక్షన్ విధిస్తూ కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోనికి వస్తాయన్నారు. నలుగురైదుగురూ ఎక్కడా గుమికూడ రాదు ఉల్లఘించిన వారిని చట్టప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతాయన్నారు.
అభినంధనలు

దేశ వ్యాప్తంగా మరో మూడు వారాలు నిర్బంధ కర్ఫ్యూ విధించాల్సిందే

విజయవాడ, మార్చి 22: దేశానికి ముంచుకొస్తున్న పెను ఉపద్రవాన్ని ఏదోవిధంగా నివారించే విషయంలో ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చాలా సీరియస్‌గా స్పందించి శరవేగంతో అడుగులు వేస్తున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. కరోనా వైరస్ విషయమై తాను ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడుతో ఫోన్‌లో ఆదివారం ఉదయం మాట్లాడినట్లు చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద దేశాలను చుట్టివచ్చిన తర్వాత కరోనా వైరస్ ఆఖరిగా మన దేశంలోకి ప్రవేశించిందన్నారు. చైనా ప్రభుత్వం తక్షణం స్పందించి త్వరగానే వైరస్‌ను ఆ దేశం నుంచి పారదోల గలిగిందన్నారు.

కరుణ లేని కరోనా కట్టడికి నడుంకట్టండి

విజయవాడ, మార్చి 22: యావత్ ప్రపంచం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్న తరుణంలో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనావస్థకు చేరుతూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్న ఈ సమయంలో అకుంఠిత దీక్షతో మొత్తం మానవజాతి మహాయుద్ధానికి సిద్ధం కావాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆత్మరక్షణ, ఆరోగ్య క్రమశిక్షణ అనే రెండే అంశాలు ప్రస్తుతం మన ఆయుధాలని తెలిపారు. శత్రువు మనకన్నా కొన్ని వేల రెట్లు శక్తిమంతమైనప్పుడు ఆత్మరక్షణ అసలైన యుద్ధ వ్యూహమని, కరోనాపై యుద్ధంలో ఆత్మరక్షణే ప్రధాన ఆయుధమన్నారు.

వన్‌టౌన్‌లో 31వరకూ కర్ఫ్యూ

విజయవాడ పశ్చిమ: కరోనా ప్రభావంతో పాతబస్తీలోని మేకలపాటి వారి వీధిని అధికారులు అష్ట దిగ్బంధం చేశారు. ఓ యువకుడికి కరోనా లక్షణాలు బయటపడటంతో ఆదివారం సాయంత్రం నుండి అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కరోనా బాధితుని ఇంటి పరిసరాల్లో చుట్టూ కిలోమీటర్ మేర వీధులన్నింటినీ మున్సిపల్ అధికారులు బారికేడ్లతో మూసేశారు. ఐరన్ మెష్‌లు, ఐరన్ రాడ్ల సాయంతో పలువీధుల్లో రాకపోకలు నివారించారు.

కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్!

విజయవాడ క్రైం: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై మన దేశం యుద్ధాన్ని ప్రకటించటంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న భద్రతాపరమైన చర్యల్లో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ నెల 31వరకు లాక్‌డౌన్ పాటించాలని పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు ఆదివారం రాత్రి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన క్రమంలో అప్రమత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

రోడ్డెక్కని ‘జనతా’

మచిలీపట్నం: కొరలు చాస్తున్న కరోనా మహమ్మారి స్వీయ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జిల్లా వాసులు జనతా కర్ఫ్యూని పాటించారు. దేశ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించి ఇళ్లకు పరిమితం కావడం విశేషం. ప్రపంచానే్న గజగజవణికిస్తున్న కరోనాను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు జిల్లా ప్రజలంతా స్వచ్ఛంద నిర్భంధంతో సంపూర్ణ సహకారం అందించడం విశేషం. బిజీ లైఫ్ స్టైల్‌లో కుటుంబ బాంధవ్యాలనే మరచిపోతున్న రోజుల్లో జనతా కర్ఫ్యూ ఒక్కసారిగా వాటి విలువేమిటో ప్రజలకు తెలియచెప్పిదనక తప్పదు.

పాజిటీవ్ కేసు విషయంలో ఆందోళన వద్దు

మచిలీపట్నం: కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనడం హర్షణీయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం ఆయన తన ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం నుండి రాత్రి వరకు ఇంట్లో ఉన్న ఆయన తనను కలిసేందుకు కూడా ఎవ్వరినీ ఇంటికి రావద్దని ముందుగానే చెప్పారు. దీంతో ఎప్పుడూ ప్రజలతో రద్దీగా ఉండే తన కార్యాలయం వెలవెలబోయింది. కుటుంబ సభ్యులతో ఇంటికే పరిమితమైన మంత్రి పేర్ని నాని తన ఆరాద్య దైవమైన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిన యాత్ర సినిమాను వీక్షించారు.

Pages