అక్షరాలు రాని వారు ప్రొఫెసర్లా?
Published Friday, 28 April 2017హైదరాబాద్, ఏప్రిల్ 27: ఉన్నత విద్యారంగం నాశిరకంగా తయారవుతోందని, దానికి కారణం ప్రమాణాలు కొరవడటమేనని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ విజయ్ కుమార్ సారస్వత్ పేర్కొన్నారు. ఇదో వేలం వెర్రిలా తయారైందని , యూనివర్శిటీల్లో ఉద్యోగానికి వచ్చిన వారు కనీసం ఆ దరఖాస్తు రాయడం కూడా రావడం లేదని, నాశిరకం పిహెచ్డిలతో ఉద్యోగాలకు రావడం వల్ల విద్యార్ధులు కూడా అదే రకంగా తయారవుతున్నారని అన్నారు. రెండు రోజుల పాటు జరిగే వైస్ ఛాన్సలర్ల జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలు దిగజారడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విస్తరణ చేసుకోవాలి కాని ఎంత మూల్యానికి అని ప్రశ్నించారు.