S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ అధికారులపై బిగుస్తున్న ఉచ్చు

గచ్చిబౌలి, డిసెంబర్ 11: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నానక్‌రాంగూడలో కూలిన భవనం కేసును సైబరాబాద్ పోలీసు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అడిషనల్ డిసిపి క్రైమ్స్ శ్రీనివాస్ రెడ్డిని దర్యాప్తు అధికారి పర్యవేక్షిస్తున్నారు. భవనం యజమాని సత్తూసింగ్‌పైన అతని కుమారుడు అనిల్ కుమార్ సింగ్‌పైన స్టక్చరల్ ఇంజనీర్, మేస్ర్తిలపై కేసులు నమోదు చేశారు. భవనం నిర్మాణ సమయంలో యజమాని సత్తూసింగ్.. ఎవరెవరికి లంచం ఇచ్చాడో కూపీ లాగుతున్నారు. టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి మధ్యవర్తులుగా గతంలో రెవెన్యూ విభాగంలో పని చేసి ముజ్రాడాన్స్ కేసులో సస్పెండ్‌కు గురైన ఇద్దరు ఉద్యోగులు ఉన్నాట్లు తెలిసింది.

వరుస సెలవులు.. తప్పని కరెన్సీ కష్టాలు..!

హైదరాబాద్, డిసెంబర్ 11: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు వరుస సెలవులు తోడయ్యాయి. దీంతో ఖాతాదారుల పరిస్థితి పుండు మీద కారం చల్లిన విధంగా తయారయ్యింది. నెలరోజుల పాటు నగదు కోసం అష్టకష్టాలు పడ్డ నగరవాసుల్లో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఓపిక నశించి ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. రెండో శనివారం తోపాటు వరుసగా ఆదివారం , సోమవారం మిలాద్-ఉన్-నబి సెలవుకావటంతో ఖాతాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

గాంధీజీ సిద్ధాంతాలే ప్రపంచానికి మార్గదర్శకం

హైదరాబాద్, డిసెంబర్ 11: సమాజంలో మార్పు రావాలని ఉపన్యాసాలు ఇస్తే సరిపోదని, నాయకుల్లో మార్పు రావాలని మహాత్మా గాంధీజీ ఆశయాలు పాటించినప్పుడే దేశంలో నూతన శకం ప్రారంభమవుతుందని ఢిల్లీలోని కేంద్రీయ గాంధీ స్మారక నిధి కార్యదర్శి రామచంద్ర రాహీ అన్నారు.

2019 ఎన్నికల్లో తెదేపాదే విజయం

ఇబ్రహీంట్నం, డిసెంబర్ 11: జరగబోయే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, జడ్పిటిసి పొట్టి అయిలయ్యతో కలిసి మాట్లాడుతూ గ్రామాల్లో ఆశించిన స్థాయి కంటే అత్యధికంగా సభ్యత్వ నమోదు చేపడుతున్నట్లు చెప్పారు. గ్రామగ్రామాన తెదేపా సభ్యత్వ నమోదుకు కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

సంస్కృతి టౌన్‌షిప్ సర్వసభ్య సమావేశం రసాభాస

ఘట్‌కేసర్, డిసెంబర్ 11: వాద ప్రతివాదనలు, ఒకరిని ఒకరు దూషించుకోవటం, ఒకరు మాట్లాడితే మరొకరు అడ్డుకుని మాట్లాడటం, అడ్డుకున్న వారితో తోపులాటలతో సంస్కృతి టౌన్‌షిప్ సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారింది. మండల పరిధి పోచారం పంచాయతీ సంస్కృతి టౌన్‌షిప్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు బి.హరిప్రసాద్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. టౌన్‌షిప్ ఆవరణలోని కళావేదిక వద్ద జరిగిన సర్వసభ్య సమావేశం ఆదివారం రసాభాసగా జరిగింది. గత సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసిన అంతర్గత ఆడిట్ రిపోర్టు ఆధారంగా అధ్యక్షుడి నేరం రుజువయినందున అతనికి పదవిలో కొనసాగే హక్కు లేదని సభ్యులు ఆరోపించారు.

స్కాలర్‌షిప్ చెస్ టోర్నీ ప్రారంభం

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో చెస్ క్రీడను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ప్రభుత్వ పాఠశాల, గురుకుల, సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినీవిద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఫౌండేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా మొత్తం పది జిల్లాల్లో జిల్లాల వారీగా చెస్ టోర్నమెంట్‌లను నిర్వహించిన అనంతరం రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది.

రైతులకు పూర్తి రుణమాఫీ చేయండి

ఘట్‌కేసర్, డిసెంబర్ 11: ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఏకకాలంలో రుణమాఫీ చేయాలని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలో ఆదివారం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన రైతు భరోసా యాత్రలో కేఎల్‌ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2014 ఎన్నికలకు ముందు రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తెల్లారే మాటమార్చి ఒక్క ఏడాదికే రుణమాఫీ చేస్తామనటం సిగ్గు చేటని విమర్శించారు. బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణానికి మాఫీ వర్తించదని మెలిక పెట్టడం ఎంతవరకు సబబు అన్నారు.

ఉస్మానియాలో కిడ్నీ, లివర్ టవర్ ఏర్పాటు

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైద్య రంగం గాడిలో పడిందని, ప్రజావైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ అలుమ్ని (పూర్వ విద్యార్థుల) అసోసియేషన్ గ్లోబల్ మీట్ ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉస్మానియాలో చారిత్రకమైన పాత భవనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త భవనాల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. కొత్త భవనాల నిర్మాణానికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయని, త్వరలోనే ముఖ్యమంత్రి భవనాలకు శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు.

కృష్ణాజలాల తరలింపు వేగం

హైదరాబాద్, డిసెంబర్ 11: నాగర్‌కర్నూలు, వనపర్తి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు సాగునీటిని, తాగునీటిని అందించేందుకు రూపొందించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు, నాగర్‌కర్నూలు, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మరికొన్నిప్రాంతాలకు సాగునీటిని, తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ రెండు పథకాల పురోగతిని పరిశీలించేందుకు హైదరాబాద్ నుండి మీడియా ప్రతినిధులను ఆదివారం ప్రభుత్వం తీసుకువెళ్లింది.

చిన్న సినిమాలకు ప్రోత్సాహం

సిద్దిపేట, డిసెంబర్ 11 : తెలంగాణ ఫిలిం చాంబర్స్‌కు కేంద్ర ప్రభుత్వం సినిమాలకు సెన్సార్, టైటిల్ రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కల్పించిందని తెలంగాణ ఫిలిం చాంబర్స్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ వెల్లడించారు. తెలంగాణ ఫిలిం చాంబర్స్ స్థాపించిన రెండేళ్లలో మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఫిలిం చాంబర్స్ పక్షాన అమ్మకు ప్రేమతో సినిమాకు సెన్సార్ చేసి క్లీన్ యూ సర్ట్ఫికేట్ అందచేశారన్నారు. దేశంలోని ఏ భాషలోని సినిమాకైనా తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన సెన్సార్ చేయవచ్చన్నారు.

Pages