గ్రేటర్ అధికారులపై బిగుస్తున్న ఉచ్చు
Published Monday, 12 December 2016గచ్చిబౌలి, డిసెంబర్ 11: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నానక్రాంగూడలో కూలిన భవనం కేసును సైబరాబాద్ పోలీసు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అడిషనల్ డిసిపి క్రైమ్స్ శ్రీనివాస్ రెడ్డిని దర్యాప్తు అధికారి పర్యవేక్షిస్తున్నారు. భవనం యజమాని సత్తూసింగ్పైన అతని కుమారుడు అనిల్ కుమార్ సింగ్పైన స్టక్చరల్ ఇంజనీర్, మేస్ర్తిలపై కేసులు నమోదు చేశారు. భవనం నిర్మాణ సమయంలో యజమాని సత్తూసింగ్.. ఎవరెవరికి లంచం ఇచ్చాడో కూపీ లాగుతున్నారు. టౌన్ప్లానింగ్ సిబ్బందికి మధ్యవర్తులుగా గతంలో రెవెన్యూ విభాగంలో పని చేసి ముజ్రాడాన్స్ కేసులో సస్పెండ్కు గురైన ఇద్దరు ఉద్యోగులు ఉన్నాట్లు తెలిసింది.