నగదు రహిత గ్రామానికి వెంకయ్య కితాబు
Published Monday, 12 December 2016హైదరాబాద్, డిసెంబర్ 11:దేశంలో రెండవ నగదు రహిత గ్రామం ఇబ్రహీంపూర్ గ్రామం నిలిచినందుకు కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు ట్విట్టర్లో అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామం దేశంలో రెండవ నగదు రహిత గ్రామంగా నిలిచిందని తెలిపారు. వెంకయ్యనాయుడు ట్విట్టర్ అభినందనలకు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కృతజ్ఞతలు తెలుపుతూ రీ ట్విట్ చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రోత్సాహంతో సిద్దిపేట నియోజక వర్గం మొత్తాన్ని త్వరలోనే నగదు రహిత నియోజక వర్గంగా అభివృద్ధి చేయనున్నట్టు హరీశ్రావు తెలిపారు.