S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ గజగజ

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణను చలి వణికిస్తోంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఏడు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్ జిల్లాలోనూ 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో ఉదయం 9 గంటల వరకూ మంచు కురుస్తూనే ఉంటోంది. నిజామాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టాయి. రెండేళ్ల కిందట కొన్ని రోజులపాటు 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కొనసాగాయి. మళ్ళీ అటువంటి పరిస్థితి వస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. చలి గాలులు బాగా పెరగడంతో అస్తమా వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్నారు.

రికార్డు భాగస్వామ్యం

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్, నాలుగో రోజు ఆటలో ఎనిమిదో వికెట్‌కు 241 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించిన జయంత్ యాదవ్, విరాట్ కోహ్లీ. ఇరవై ఏళ్ల క్రితం మహమ్మద్ అజరుద్దీన్, అనిల్ కుంబ్లే దక్షిణాఫ్రికాపై ఎనిమిదో వికెట్‌కు 161 పరుగులు చేయగా, జయంత్, కోహ్లీ ఆ రికార్డును అధిగమించారు. కాగా, ఇంగ్లాండ్‌పై ఎనిమిదో వికెట్‌కు రెండు వందలకుపైగా భాగస్వామ్యం నమోదు కావడం సుమారు 109 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి.

తప్పంతా విపక్షాలదే!

బహ్రాయిచ్(ఉత్తరప్రదేశ్), డిసెంబర్ 11: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రతిపక్షాల ఆందోళనలతో తుడిచిపెట్టుకుపోవటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల తిరస్కారానికి గురైన పార్టీలు పార్లమెంట్‌లో కార్యకలాపాలు స్తంభింపజేస్తున్నాయన్నారు. ‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించి పార్లమెంట్‌లో చర్చకు మేం సిద్ధంగానే ఉన్నాం. కానీ విపక్షాలు మాత్రం మా అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ప్రజలచే తిరస్కారానికి గురైన పార్టీలు 20 రోజులుగా పార్లమెంట్‌లో కార్యకలాపాలకు పూర్తిగా ఆటంకం కలిగిస్తున్నాయి.’ అని మోదీ వ్యాఖ్యానించారు.

చెన్నై దిశగా వార్ధా

విశాఖపట్నం / మచిలీపట్నం, డిసెంబర్ 11: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా పెను తుపాను దిశ మార్చుకుంది. శనివారం వరకు మచిలీపట్నం - నెల్లూరు వైపు పయనించిన తుపాను ఆదివారం చెన్నై వైపు దిశ మార్చుకుందని వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం సాయంత్రానికి దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. తుపాను ప్రస్తుతం చెన్నైకి తూర్పున 300 కిలోమీటర్లు, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 350 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరం దాటే సమయంలో క్రమంగా బలహీన పడే అవకాశం ఉంది.

సర్వసన్నద్ధం

విజయవాడ, డిసెంబర్ 11: వార్ధా తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ, పునరావాస చర్యలు ప్రపంచానికే ఆదర్శంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రాణ, ఆస్తి, పంటనష్టాల్ని తగ్గించాలని, ఎంత వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపడితే అంత త్వరగా ఉపశమనం లభిస్తుందని అన్నారు. ఇప్పటికే మండలాల వారీగా ఈదురుగాలుల వేగం, నమోదయ్యే వర్షపాతం వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపామన్నారు.

ఇదిగో...కార్డ్!

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: డబ్బు చెల్లించగలిగీ ఎలాంటి క్రెడిట్ కార్డులు లేని వారి కోసం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ క్రెడిట్ లిమిట్‌తో కొత్త కార్డులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సమాజంలో తక్కువ ఆదాయం కలిగిన వారికోసం రూ.25వేల పరిమితితో ఈ కార్డులను విడుదల చేస్తారని స్టేట్‌బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. ‘ఇవాళ ప్రతి బ్యాంకు ఖాతాలో ఎంతో కొంత డబ్బు ఉంది. కాబట్టి మేం వాళ్లకు సురక్షితమైన కార్డును జారీ చేస్తాం. గతంలో ఎలాంటి బ్యాంకింగ్ లావాదేవీలను జరపని వాళ్లకైనా సరే ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కాకుంటే కార్డు లిమిట్ రూ.25000 ఉంటుంది.

వాటా తేల్చాల్సిందే

హైదరాబాద్, డిసెంబర్ 11: కృష్ణా జలాల పంపిణీపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో బోర్డు విఫలమైంది. ఈ నెల 13వ తేదీ లోగా బోర్డు చేసిన నీటి కేటాయింపులపై అభిప్రాయాలు తెలియచేయాలన్న బోర్డు కార్యదర్శి ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం తిప్పిగొట్టింది. ఈ వ్యవహారాన్ని కేంద్ర జల వనరుల శాఖ వద్ద తేల్చుకోవాలని, ఇంతకంటే మించి ఇప్పుడున్న పరిస్ధితుల్లో కేటాయింపులు చేయలేమని బోర్డు చేతులెత్తేసింది. దీంతో కేంద్రం వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

14444

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను విసృత పరచటానికి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 14444ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్రం ప్రకటించింది. నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజలను జాగృతం చేసేందుకు హెల్ప్‌లైన్ నెంబరును ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఈ కాల్ సెంటర్‌కు నాస్కామ్ పూర్తి సహాయం అదించనుందని వెల్లడించిన ఆయన వారంలోగా ఈ హెల్ప్ లైన్ నెంబరును అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మొదటి దశలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫీచర్ ఫోన్ లేదా ఆధార్ సంఖ్య లాంటివి ఉపయోగించేలా ఈ హెల్ప్‌లైన్ నెంబరు అందుబాటులో ఉంటుందన్నారు.

160 మంది దుర్మరణం

ఉయో, డిసెంబర్ 11: నైజీరియాలో నిర్మాణంలో ఉన్న ఓ చర్చి కుప్పకూలిన దుర్ఘటనలో 160మంది మరణించినట్టుగా కథనాలు వెలువడ్డాయి. దక్షిణ నైజీరియాలోని ఉయోలోగల రీయినర్స్ బైబిల్ చర్చిలో ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో దాని పైకప్పు కుప్పకూలిపోయింది. నిర్మాణ లోపమే ఇందుకు కారణమా అన్న అంశంపై దర్యాప్తు జరిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆదివారం సాయంత్రం వరకూ 60 మృత దేహాలను వెలికి తీశారు. ఇంకా శిధిలాల కింద అనేక మంది చిక్కుకుని ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సహాయ బృందాలు తెలిపాయి.

Pages