S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమాలియాలో ఆత్మాహుతి దాడి

మొగదిషు, డిసెంబర్ 11: సోమాలియా రాజధాని మొగదిషులో ఆదివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మందికి పైగా చనిపోగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. కాగా, ఈ దాడిని తామే జరిపినట్లు అల్‌ఖైదాతో సంబంధాలున్న షబాబ్ ఉగ్రవాద ముఠా ప్రకటించుకుంది. ఇప్పటివరకు తాము వేసిన లెక్కల ప్రకారం ఈ పేలుడులో 20 మందికి పైగా చనిపోయారని, వారిలో ఎక్కువమంది పౌరులేనని సోమాలియా పోలీసు అధికారి ఇబ్రహీం మహమ్మద్ చెప్పారు. మృతులు, క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్లినందున మృతుల సంఖ్య పెరగవచ్చని ఆయన చెప్పారు. కాగా, పేలుడు జరిగిన ప్రాంతం చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలియరాలేదు.

కైరో చర్చిలో బాంబు పేలుడు

కైరో, డిసెంబర్ 11: ఈజిప్టు రాజధాని కైరోలోని ప్రముఖ కాప్టిక్ క్రిస్టియన్ క్యాథడ్రైల్‌లో ఆదివారం జరిగిన బాంబు పేలుడులో కనీసం 25 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. ఆదివారం ప్రార్థనలకోసం పెద్ద సంఖ్యలో జనం చేరినప్పుడు ఈ పేలుడు సంభవించింది. ఇటీవలి కాలంలో మైనారిటీ క్రిస్టియన్లపై ఇస్లామిక్ మిలిటెంట్లు జరిపిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.

దద్దరిల్లిన టర్కీ

ఇస్తాంబుల్, డిసెంబర్ 11: టర్కీ మరోసారి ఆత్మాహుతి బాంబుదాడులతో దద్దరిల్లిపోయింది. దేశంలోని ముఖ్య నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి సంభవించిన జంట బాంబు పేలుళ్లలో కనీసం 38 మంది మృతిచెందగా, మరో 155 మంది గాయపడ్డారు. పోలీసు అధికారులే లక్ష్యంగా జరిగిన ఈ బాంబు పేలుళ్ల కారణంగా 30 మంది పోలీసులు, మరో ఎనిమిదిమంది పౌరులు మృతి చెందారని టర్కీ ఆంతరంగిక శాఖ మంత్రి సులేమాన్ సోయ్లు ఆదివారం తెల్లవారుజామున విలేఖరులకు చెప్పారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ప్రకటించారు. తొలి పేలుడు ఒక ఫుట్‌బాల్ స్టేడియం వెలుపల, రెండో పేలుడు ఓ పార్కు ఆవరణలో సంభవించాయి.

నల్ల కుబేరులకే ముచ్చెమటలు

సోలన్(హిమాచల్‌ప్రదేశ్), డిసెంబర్ 11: హిమాచల్ ప్రదేశ్‌కు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ను ఓడించటం ద్వారా అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రహిత భారత దేశ ఆవిష్కరణకు హిమాచల్ ప్రదేశ్ అధికారం నుంచి ఆ పార్టీ ని ఓడించటమే ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ విజయ రథం హిమాచల్ ప్రదేశ్‌కు కూడా చేరుకుంటుందని అమిత్‌షా అన్నారు.

చితికిపోతున్న బాల్యం

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ప్రపంచం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థికాభివృద్ధి, ఇతర రంగాలలో ఎంతో పురోగతి సాధించినప్పటికీ ఇప్పటికీ విద్యను ఆర్జించాల్సిన వయసులో ఉన్న పది కోట్లకు పైగా మంది బాలలు బడి బయట ఉన్నారని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాలలంతా బాల్యాన్ని అనుభవించలేకపోతున్నారని, ఎన్నో రకాలుగా దోపిడీకి గురవుతున్నారని ఆయన అన్నారు. బాలలు సురక్షితం గా, భద్రంగా లేకుండా, మార్పుకు కారకులయిన బాలలకు స్వేచ్ఛను, అవకాశాలను కల్పించకుండా పురోగతి సాధించజాలమనే విషయాన్ని ప్రపం చం ఇంకెంత మాత్రం జాప్యం చేయకుండా గుర్తిం చాలని ఆయన సూచించారు.

భారత్‌ను విడదీసేందుకు పాక్ కుట్ర

కథువా (జమ్మూ-కాశ్మీర్), డిసెంబర్ 11: మతాన్ని ఆధారంగా చేసుకుని భారత్‌ను విడదీసేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే పాక్ ఎన్ని కుయుక్తులు పన్నినా అవి విజయవంతం కాబోవని ఆయన స్పష్టం చేశారు. అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం కథువా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ రాజ్‌నాథ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘మతం పేరుతో భారత్‌ను విడగొట్టేందుకు పాక్ కుట్ర చేస్తోంది. కానీ అటువంటి కుట్రలు ఫలించబోవు. మతం ప్రాతిపదికగా మనం 1947లో ఇప్పటికే ఒకసారి విడిపోయాం. ఆ విభజనను మనం ఇప్పటికీ మరువలేకపోతున్నాం.

పార్టీని నడపడానికి శశికళే తగిన వ్యక్తి

చెన్నై, డిసెంబర్ 11: ఎఐఎడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ చేపట్టాలనే అభిప్రాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వం వ్యక్తం చేసిన మరుసటి రోజే ఆ పార్టీ నాయకుడు, లోక్‌సభలో డిప్యూటి స్పీకర్ ఎం.తంబిదురై కూడా ఆమెకు మద్దతు పలికారు. ఎఐఎడిఎంకె పార్టీని భవిష్యత్తులో ముందుకు నడపడానికి శశికళ తగిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. పార్టీ దివంగత ముఖ్యమంత్రి జయలలితకు విశ్వాసపాత్రురాలయిన వ్యక్తి శశికళ అనే విషయం అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలలో గతంలో జయలలితకు శశికళ సలహాలు ఇచ్చేవారని ఆయన వెల్లడించారు. పార్టీ పగ్గాలను చేపట్టాలని ఆయన శశికళను కోరారు.

మిలాద్ ఉన్ నబీకి రాష్టప్రతి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు పవిత్రంగా జరుపుకునే మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీలు దేశ ప్రజలకు తమ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వమానవ సౌభ్రాతృత్వానికి, సహనానికి మహమ్మద్ ప్రవక్త సందేశాలు ఆచరణీయమని వారన్నారు. ‘‘మహమ్మద్ ప్రవక్త పవిత్రమైన జన్మదినం సందర్భంగా దేశ ప్రజలకు, ప్రపంచంలోని భారతీయులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహమ్మద్ ప్రవక్త సేవలు మనందరికీ ప్రేరణ కలిగించేవి’’ అని రాష్టప్రతి పేర్కొన్నారు.

అమెరికా విదేశాంగ మంత్రిగా టిల్లెర్సన్?

వాషింగ్టన్, డిసెంబర్ 11: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి పదవిని ఎక్సాన్ మొబైల్ సంస్థ సిఇఓ రెక్స్ టిల్లెర్సన్‌కు కట్టబట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తదుపరి ప్రభుత్వంలో ఈ పదవిని ఆశిస్తున్న వారిలో టిల్లెర్సన్ అందరికంటే ముందున్నాడు. దీంతో ఆయననే ఈ పదవికి ఎంపిక చేయాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

బ్లాక్‌మెయిల్ రాజకీయాలు సరికాదు

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: నోట్ల రద్దుపై పార్లమెంటులో మాట్లాడడానికి ప్రతిపక్షాలు తనకు అవకాశమివ్వడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను బిఎస్పీ అధినేత్రి మాయావతి ఆదివారం తీవ్రంగా తప్పుబడుతూ, లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉన్న పార్టీ నాయకుడిగా ఆయన అలాంటి ఆరోపణలు చేయడం సరికాదని, భావోద్వేగాలను రెచ్చగొట్టి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే ఆయన ధోరణి ఏ మాత్రం పని చేయదని అన్నారు. అంతేకాదు ప్రధాని ధోరణి గురివింద సామెతను గుర్తు తెస్తోందని ఆమె అన్నారు. ‘లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్న పార్టీ నాయకుడు అలాంటి ఆరోపణలు చేయడం సరికాదు. ఇది ‘దొంగే పోలీసును దొంగ..

Pages