సోమాలియాలో ఆత్మాహుతి దాడి
Published Monday, 12 December 2016మొగదిషు, డిసెంబర్ 11: సోమాలియా రాజధాని మొగదిషులో ఆదివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మందికి పైగా చనిపోగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. కాగా, ఈ దాడిని తామే జరిపినట్లు అల్ఖైదాతో సంబంధాలున్న షబాబ్ ఉగ్రవాద ముఠా ప్రకటించుకుంది. ఇప్పటివరకు తాము వేసిన లెక్కల ప్రకారం ఈ పేలుడులో 20 మందికి పైగా చనిపోయారని, వారిలో ఎక్కువమంది పౌరులేనని సోమాలియా పోలీసు అధికారి ఇబ్రహీం మహమ్మద్ చెప్పారు. మృతులు, క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్లినందున మృతుల సంఖ్య పెరగవచ్చని ఆయన చెప్పారు. కాగా, పేలుడు జరిగిన ప్రాంతం చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలియరాలేదు.