కోహ్లీ ‘డబుల్’.. జయంత్ సెంచరీ
Published Monday, 12 December 2016ముంబయి, డిసెంబర్ 11: విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో కదంతొక్కితే, జట్టులోకి కొత్తగా వచ్చిన ఆల్రౌండర్ జయంత్ యాదవ్ శతకాన్ని నమోదు చేశాడు. అంతకు ముందు, మ్యాచ్ మూడోరోజు ఆటలో మురళీ విజయ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ముగ్గురు బ్యాట్స్మెన్ అద్వితీయ ప్రతిభ కనబరచడంతో, ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగు రోజు ఆటలో భారత్ 631 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. దీనితో 231 పరుగులు వెనుకబడిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ను ఆరంభించి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 182 పరుగులు చేయగలిగింది. ఈ జట్టు ఇంకా 49 పరుగులు వెనుకబడిగా, నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయి.