పవన్ రుయా అరెస్టు
Published Sunday, 11 December 2016కోల్కతా, డిసెంబర్ 10: పశ్చిమ బెంగాల్ సిఐడి అధికారులు శనివారం రుయా గ్రూప్ చైర్మన్ పవన్ రుయాను అరెస్ట్ చేశారు. రైల్వే శాఖ ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా శనివారం ఉదయం న్యూఢిల్లీలోని సుందర్ నగర్లోగల రుయా నివాసానికి వెళ్లిన బెంగాల్ సిఐడి అధికారులు.. అక్కడ పవన్ రుయాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఓ సీనియర్ సిఐడి అధికారి చెప్పారు. కోల్కతాలోని డమ్ డమ్ ప్రాంతంలోగల జెస్సప్ ఫ్యాక్టరీ పరిసరాల నుంచి రైల్వే శాఖకు చెందిన 50 కోట్ల రూపాయల విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఈ ఫ్యాక్టరీ రుయా గ్రూప్ సంస్థల్లోనిదే. ఫ్యాక్టరీని సందర్శించిన రైల్వే బృందం..