అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం మొదలు
Published Sunday, 11 December 2016విజయవాడ (క్రైం), డిసెంబర్ 10:అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ మొదలైంది. పలుచోట్ల సంస్థకు చెందిన ఆస్తులను గుర్తించిన సిఐడి సీజ్ చేసిన కృష్ణాజిల్లా, విజయవాడలో కలిపి మొత్తం 24 ఆస్తులను యుద్ధప్రాతిపదికన వేలం వేసేందుకు ప్రకటన చేసింది. వేలం ప్రక్రియ ముగిశాక ఆస్తులు అమ్మగా వచ్చే సొమ్మును డిపాజిట్దారులకు పంచితే సుమారు 80శాతం మంది బాధితులకు న్యాయం చేసినట్లవుతుందని డిజిపి నండూరి సాంబశివరావు వెల్లడించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఈమేరకు హైకోర్టు పర్యవేక్షణలో వేలం ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.