గ్రామీణ విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
Published Sunday, 11 December 2016మాకవరపాలెం, డిసెంబర్ 10: గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు క్రీడల్లో ఆసక్తి కనబరిచి రాణించాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆన్నారు. శనివారం మండల కేంద్రమైన మాకవరపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో నియోజకవర్గ స్థాయి ఖేలో ఇండియా ఆటల పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా జ్యోతిప్రజ్వలన చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలన్నారు. రాష్ట్రంలో క్రీడల్లో రాణించే విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.