వరస సెలవులతో బ్యాంకర్లకు ఊరట
Published Sunday, 11 December 2016పరకాల, డిసెంబర్ 10: వరుసగా మరో రెండు రోజులు బ్యాంకులకు సెల వు రావటంతో రెండు రోజులు గడిచేదేలా అంటూ ప్రజలు అందోళన చెందుతున్నారు. పెద్ద నోట్ల రద్దు చేసి 30 రోజులు గడిచిన ప్రజలు నగదు కోసం వ్యయ ప్రయాసలకు గురవుతూనే ఉన్నారు. అదివారం సెలవు, సోమవారం మిలాద్ల్నబి సందర్భంగా వరుసగా బ్యాంకులకు రెండు రోజులు సెలవులు రావడంతో బ్యాంకు ఉద్యోగులకు కొంత ఊరట కలిగించే విషయం. వరుస పని దినాలతో నిత్యం నగదు లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు కొంత విశ్రాంతి లభించనుంది. అయితే ప్రజలకు మాత్రం వరుసగా రెండు రోజులు సెలవులు రావటంతో నగదు చేతికచ్చే పరిస్థితి కనిపించడం లేదు.