S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్వులాటగా పెద్ద నోట్ల రద్దు

హైదరాబాద్, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నవ్వులాటగా మారిందని ఎఐసిసి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని క్యాష్‌లెస్ కాదు జాబ్ లెస్‌గా మారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన అభిషేక్ సింఘ్వి గాంధీభవన్‌లో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు మల్లు రవి, దాసోజు శ్రవణ్ తదితరులతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న తుగ్లక్ నిర్ణయం వల్ల 80 మంది మరణించారని చెప్పారు. 24 రోజుల్లో 105 సార్లు మార్పులు చేశారని ఆయన తెలిపారు.

కాంగ్రెస్‌ది అసూయ దీక్ష

సిద్దిపేట, డిసెంబర్ 3: టిఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హామీల అమలుకోసం కాంగ్రెస్ నేతలు ఈనెల 5న దీక్ష చేస్తామని ప్రకటించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. టిఆర్‌ఎస్ పై విమర్శలు చేయడం సూర్యుని మీద ఉమ్మివేయడమేనన్నారు. జిల్లాకేంద్రమైన సిద్దిపేట ఆర్‌అండ్‌బి గెస్టుహౌజ్‌లో శనివారం రాత్రి జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

ఏ ఒక్కరూ అధైర్యపడవద్దు అండగా నేనుంటా

విజయవాడ, డిసెంబర్ 3: సమాజంలో విభిన్న ప్రతిభావంతులు ఎవరికీ తక్కువ కాదని అవకాశాలు కల్పిస్తే అందలం ఎక్కగలరని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా ఇలా జన్మించామంటూ ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని, ఇతరులను నిందిస్తూ బాధపడవద్దు.. అండగా నేనున్నానంటూ హర్షధ్వానాల మధ్య భరోసా ఇచ్చారు.

మోసాలకు పాల్పడుతున్న బెంగళూరు ముఠా అరెస్టు

హైదరాబాద్, డిసెంబర్ 3: హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ, దృష్టి మళ్లించడం, రాగి చెంబులో డబ్బు పెడితే ధనం పెరుగుతుందంటూ అమాయక ప్రజలను మోసగిస్తున్న బెంగళూరు ముఠాను శనివారం సౌత్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. రెయిన్ బజార్ పోలీసుల అదుపులో నలుగురు ముఠా సభ్యులు ఉండగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు డిసిపి వి సత్యనారాయణ తెలిపారు. నిందితుల నుంచి రూ. 1.35 లక్షలు నగదుతోపాటు ఒక రాగి చెంబు, బ్లాంక్ పేపర్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. రెయిన్ బజార్‌కు చెందిన మహమ్మద్ ఎజాజ్ ఖాన్ (24) బట్టల వ్యాపారి. కాగా ప్యాట్నీ సెంటర్‌లో పని నిమిత్తం వచ్చిన ఆయనకు ప్రవీణ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.

అంగరంగ వైభవంగా అమ్మవారి రథోత్సవం

తిరుపతి, డిసెంబర్ 3: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన శనివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు విశేష అలంకరణ భూషితురాలై రథాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఓవైపు వర్షం కురుస్తున్నా భక్తులు గోవిందనామ స్మరణచేస్తూ రథాన్ని ముందుకు లాగి తమ భక్తిని చాటుకున్నారు. నాలుగు మాడవీధుల్లో కూడా భక్తులు వర్షంలో తడుస్తూనే రథోత్సవాన్ని తిలకిస్తూ కర్పూర రతులు పట్టి భక్తిపారవశ్యంతో పులకించారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు రథ మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

ప్రెషర్ బాంబు పేలి మాజీ సర్పంచ్‌కు గాయాలు

భద్రాచలం, డిసెంబర్ 3: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పిఎల్‌జిఏ వారోత్సవాలు హింసాత్మకంగా మారాయి. నక్సల్స్ వారోత్సవాలు విజయవంతం చేయాలంటూ కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేసి వాటి కింద ప్రెషర్ బాంబులు పెడుతున్నారు. మొన్న తెలంగాణలోని భూపాల్‌పల్లి జిల్లా వెంకటాపురం మండలం విజయపురికాలనీలో, నిన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని హిరోలీ, నేడు ఇదే రాష్ట్రంలోని సుక్మా జిల్లా పోలంపల్లి వద్ద ప్రెషర్‌బాంబులు పేలాయి.

స్వర్ణదేవాలయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ

హార్ట్ ఆఫ్ ఆసియా కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి శనివారం రాత్రి అమృత్‌సర్ వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనితో కలిసి స్వర్ణదేవాలయం సందర్శించారు. ఆలయ భోజన శాలలో స్వయంగా గరిట పట్టుకుని వడ్డించారు. ఆదివారం అమృత్‌సర్‌లో ఈ సదస్సు జరగనుంది. పాకిస్తాన్ నుంచి ఆ దేశ ప్రధాని విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ పాల్గొంటున్నారు.

మా ‘బంగారు’ భవిష్యత్ ఏమిటి?

తిరుపతి, డిసెంబర్ 3: తమ బంగారు భవిష్యత్తు ఏమిటంటూ మహిళామణులు ప్రభుత్వ తీరుపై కనె్నర్ర చేశారు. శనివారం తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద వైకాపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా మహిళామణులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా మహిళలు నిరసన వ్యక్తం చేశారు. బంగారు ఆభరణాల గురించి ఐటి అధికారులు లెక్కలు అడుగుతారని విస్తృత ప్రచారం జరిగిన విషయం పాఠకులకు విదితమే. ఈక్రమంలో రాష్టవ్య్రాప్తంగా మహిళల్లో తమ వారసత్వపు ఆభరణాలు ఏమవుతాయోనని ఆందోళన నెలకొంది.

గిరిజనుల సంస్కృతి, అస్తిత్వాన్ని పరిరక్షించాలి

శ్రీకాకుళం, డిసెంబర్ 3: గిరిజనుల సాంప్రదాయాలు, సంస్కృతి, అస్తిత్వాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథ్ పిలుపునిచ్చారు. గిరిజన హక్కుల పరిరక్షణ, అమలుపై రాష్ట్ర న్యాయ సేవాసాధికారిత సంస్థ సౌజన్యంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల న్యాయ సేవా సాధికారిత సంస్థల సదస్సును ఇక్కడి జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేశారు.

మొరాయిస్తున్న బ్యాంకు సర్వర్లు

కర్నూలు, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం, బ్యాంకులు, ఎటిఎంలలో నగదు కొరత నేపధ్యంలో ఆన్‌లైన్ కొనుగోళ్లకు సిద్ధపడిన ప్రజలకు బ్యాంకు సర్వర్లు చుక్కలు చూపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువుల బిల్లుల చెల్లింపులకే కాకుండా దుకాణాల్లో కొనుగోళ్ల అనంతరం స్వైపింగ్ యంత్రాల ద్వారా బిల్లు చెల్లిద్దామంటే అవి కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు మండిపడుతున్నారు. గత రెండు, మూడు రోజులుగా సమస్య ఉన్నా శనివారం నాటికి అది మరింత తీవ్రతరమై అసలే పని చేయడం లేదని కొందరు వ్యాపారులు పేర్కొన్నారు.

Pages