నవ్వులాటగా పెద్ద నోట్ల రద్దు
Published Sunday, 4 December 2016హైదరాబాద్, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నవ్వులాటగా మారిందని ఎఐసిసి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని క్యాష్లెస్ కాదు జాబ్ లెస్గా మారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. శనివారం హైదరాబాద్కు వచ్చిన అభిషేక్ సింఘ్వి గాంధీభవన్లో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు మల్లు రవి, దాసోజు శ్రవణ్ తదితరులతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న తుగ్లక్ నిర్ణయం వల్ల 80 మంది మరణించారని చెప్పారు. 24 రోజుల్లో 105 సార్లు మార్పులు చేశారని ఆయన తెలిపారు.