ఆట పాటలతో ఉర్రూతలూగించిన దేవిశ్రీ ప్రసాద్
Published Saturday, 3 December 2016రామచంద్రపురం, డిసెంబర్ 2: డోనార్స్క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన సినీ సంగీత దర్శకులు, గాయకుడు దేవిశ్రీ ప్రసాద్ తన మాట-ఆట-పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. మాట్లాడటానికి లేవగానే విద్యార్థులు, ప్రజాసమూహం నుండి పాట కావాలంటూ నినాదాలు చేయగా..ఏ పాట పాడమంటారని దేవిశ్రీ ప్రసాద్ అడిగారు. పలు పాటలు పాడాలంటూ వచ్చిన అభ్యర్థనల మేరకు మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్దాదా ఎంబిబిఎస్ చిత్రంలోని పాటను నృత్యం చేస్తూ పాడారు. అనంతరం రెండు మూడు పాటలు ఆలపించి, తరువాత మాట్లాడారు. తన తండ్రి, దివంగత సత్యమూర్తి డోనార్స్క్లబ్ ఏర్పాటుకు నామకరణం చేసిన విషయం తెలిసినవెంటనే..