గర్భిణి ప్రాణం తీసిన పాత నోటు!
Published Saturday, 26 November 2016పాట్నా, నవంబర్ 25:రద్దయిన 500నోటును చికిత్స కోసం ఆసుపత్రి వర్గాలు స్వీకరించక పోవడం వల్ల గయలో ఓ గర్భిణి మరణించిన సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ మేరకు మీడియాలో వచ్చిన కథనాలను స్వీకరించిన బీహార్ మానవ హక్కుల సంఘం జిల్లా మెజిస్ట్రేట్, సంబంధిత ఆసుప్రతి వర్గాలపై నిప్పులు చెరిగింది. పక్షం రోజుల్లో తమకు నివేదిక అందించాలని ఆదేశించింది. గయలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రిలోనే ఈ సంఘటన జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందని మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మూత్రం ఆగిపోయిన కారణంగా ఆ గర్భిణికి డయాలిసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.