ప్రధాని చర్చకు రావలసిందే
Published Friday, 25 November 2016న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లపై చర్చకు రాకుండా తప్పించుకుంటున్నారంటూ ప్రతిపక్షం గురువారం రాజ్యసభను స్తంభింపజేసింది. నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే భోజన విరామం తరువాత ఆయన సభకు రాకపోవడంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. పెద్దనోట్ల రద్దుపై చర్చ జరిగినంత సేపూ మోదీ రాజ్యసభలో ఉండాల్సిందేనని వారు పట్టుపడుతున్నారు. ప్రధాని ఉంటేనే కరెన్సీ రద్దుపై ప్రారంభించిన చర్చను ముందుకు సాగనిస్తామని ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, బిఎస్పి అధ్యక్షురాలు మాయావతి, సిపిఎం పక్షం నాయకుడు సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.