హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారుల దాడులు
Published Tuesday, 22 November 2016సిద్దిపేట, నవంబర్ 22 : సిద్దిపేట పట్టణంలో హోటళ్లు, రెస్టారెంట్లలో అక్రమంగా డోమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్న వారిపై సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి 39 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం పట్టణంలో 27 హోటళ్లు, రెస్టారెంట్లపై లపై దాడులు చేపట్టి డోమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్న వారిపై చర్యలు చేపట్టారు. వారిపై నిత్యవసరాల చట్టం 1955 6ఎపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు డోమెస్టిక్ సిలిండర్లను గృహావసారాలకు మాత్రమే వినియోగించాలన్నారు.