బాబు ముఖ్యమంత్రి కావడమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా
Published Wednesday, 26 October 2016తిరుపతి, అక్టోబరు 25: చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావడమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ కార్యక్రమంలో చంద్రన్న దళితబాట కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు, గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని దళితులకు, గిరిజనులకు చేరాలనే లక్ష్యంతోనే వారిలో అవగాహన పెంచేందుకు 13 జిల్లాల్లో చంద్రన్న దళితబాట కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా నుంచి చేపట్టామన్నారు.