హోటల్పైకి దూసుకెళ్లిన బస్సు..!
Published Wednesday, 28 September 2016సుల్తానాబాద్, సెప్టెంబర్ 27: సుల్తానాబాద్ ఆర్టీసి బస్టాండ్ వద్ద మంగళవారం ఘోరప్రమాదం తప్పింది. కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపుకు లారీ వెళ్తుంది. పెద్దపల్లి నుండి సుల్తానాబాద్కు బస్సు వస్తుంది. బస్సు బస్టాండ్లోకి వెళ్లేందుకు వస్తుండగా భారీ వాహనంగల లారీ అతను గమనించి ఒక్కసారిగా బస్టాండ్లోకి లారీని పో నిచ్చాడు. దీంతో ఆర్టీసి బస్సు పక్కనే ఉన్న సాయిశ్రీ హోటల్పైకి దూసుకెళ్లింది. హోటల్ ముందు వేసిన రేకులు బస్సులోకి పోవడంతో అద్దాలు ధ్వసంమయ్యాయి. లారీ-బస్సు ఢీకొంటే పె ద్దఎత్తున ప్రాణనష్టంతోపాటు ఎంతో మంది క్షతగాత్రులైఉండేవారు.