బిగ్ బాష్ లీగ్తో మంధానా కాంట్రాక్టు
Published Tuesday, 27 September 2016న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఆస్ట్రేలియాలో జరిగే ప్రతిష్ఠాత్మక బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్) మహిళల టోర్నీలో భారత బ్యాట్స్విమన్ స్మృతి మంధాన పాల్గొననుంది. బిబిఎల్లో పోటీపడే బ్రిస్బేన్ హీట్స్తో ఆమె ఏడాది పాటు అమల్లో ఉండే ఒప్పందం కుదుర్చుకుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నుంచి నో ఆబ్జెక్షన్ సర్ట్ఫికెట్ లభించిందని, దీనితో కాంట్రాక్టు లాంఛనాలు పూర్తయ్యాయని మంధానా మంగళవారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పింది. బ్రిస్బేన్ జట్టుతో తాను ఇంతకు ముందు మ్యాచ్ ఆడానని, ఇప్పుడు అదే జట్టులో సభ్యురాలుగా చేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది.