సైనికులకు సంఘీభావంగా ఉరీకి బైక్ యాత్ర
Published Friday, 23 September 2016గుంటూరు, సెప్టెంబర్ 22: దేశ సరిహద్దుల్లో పాక్ చొరబాటుదార్లను వీరోచిత పోరాటాల ద్వారా ప్రతిఘటిస్తున్న వీర సైనికుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తికావాలని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడ నుంచి కొద్దిరోజుల క్రితం కార్గిల్కు మోటారుబైక్లపై యాత్రచేసి సైనికులను కలుసుకుని వచ్చిన ఏపి ప్రతినిధి బృందాన్ని కన్నా అభినందించారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు సముద్రాలు, సకల నదీ జలాలతో కాశ్మీర్లోని ఉరీకి వచ్చేనెల ఒకటో తేదీన గుంటూరు నుంచి 20 మందితో కూడిన బృందం బైక్ యాత్ర ప్రారంభిస్తుందని చెప్పారు.