జనగామ జనగర్జనలో ఉద్రిక్తత
Published Tuesday, 20 September 2016వరంగల్ : జనగామలో మంగళవారం జనగర్జన సభకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరు కావడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సభా స్థలి నుంచి వెనక్కి వెళ్లాలని ప్రజలు నినాదాలు చేశారు. జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు అనుమతితో ఐకాస బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, సున్నం రాజయ్య, మందాడి సత్యనారాయణ హాజరయ్యారు.