దేనికైనా సిద్ధం!
Published Tuesday, 20 September 2016ఇస్లామాబాద్, సెప్టెంబర్ 19: యూరి మిలిటెంట్ దాడి నేపథ్యంలో భారత్ నుంచి ఎలాంటి సవాళ్లు తలెత్తినా ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సన్నద్ధమవుతోంది. భారత నాయకత్వం తీవ్రస్థాయిలో హెచ్చరిక స్వరాన్ని వినిపించడంతో పాక్ ఆర్మీ చీఫ్ సోమవారం సైనిక కమాండర్లతో సమావేశమయ్యారు. దేశీయ, బాహ్య భద్రతా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిణామాలు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని వారికి స్పష్టం చేశారు.