నేటి నుంచి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన
Published Wednesday, 31 August 2016అనంతపురం, ఆగస్టు 29: వర్షాభావంతో ఎండుతున్న వేరుశెనగ పంటను కాపాడేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన రక్షక తడి ప్రక్రియను క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు జిల్లాకు రానున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లాలోనే ఉంటూ రెయిన్గన్స్ ద్వారా పంటకు ఇచ్చే మొదటి రక్షక నీటి తడులు సక్రమంగా అందేలా పర్యవేక్షిస్తారు. ఈ సందర్భంగా రోజుకు రెండేసి నియోజకవర్గాల్లో పలు గ్రామాల్లో పర్యటించే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నానికి సిఎం జిల్లాకు చేరనున్నారు. తొలుత పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం పెద్దమంతూరుకు మధ్యాహ్నం ఒంటి గంటలకు రానున్నారు.