కార్మిక హక్కులను హరిస్తున్న మోదీ ప్రభుత్వం
Published Monday, 29 August 2016నర్సీపట్నం, ఆగస్టు 28: కార్మిక హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం హరిస్తోందని కేరళ మత్స్య, జీడిపిక్కల పరిశ్రమల శాఖ మంత్రి మెర్సి కుట్టిఅమ్మ ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీడిపిక్కల కార్మికుల సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో అసంఘటిత రంగ కార్మికులు దుర్భరమైన జీవన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.