మరో మల్లినాథుడు
Published Sunday, 7 August 2016తెలుగువారికి చాలాకాలం నాడు ఒక మల్లినాథసూరి కాళిదాస కావ్యాలకు గొప్ప వ్యాఖ్యానాలు రాసి సంస్కృత సాహిత్య భిక్ష పెట్టినాడు. అటు తరువాత వేదాంత దేశికులు తమ సంస్కృత పాండితీప్రకర్ష చేత అనేక రచనలు చేస్తే అవన్నీ సంస్కృతంలో ఉండి కొందరికే తెలిసే స్థితి ఏర్పడింది. తమిళదేశం వారు వాటిని ఇంగ్లీషులోకి, తమిళంలోకి అనువదించుకున్నారు. తెలుగువారికి దేశిక సాహిత్యం పరిచయం కాకపోవడం అనే లోపాన్ని గ్రహించి కెవి రాఘవాచార్య గారు అసిధారావ్రతంగా పాదుకా సహస్రానే్న కాకుండా అనేక రచనలకు గొప్ప వ్యాఖ్యానాలను రచించారు.