ప్రత్యేకహోదాపై త్వరలో స్పష్టత
Published Sunday, 7 August 2016న్యూఢిల్లి:ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై త్వరలో స్పష్టత వస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. న్యూఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని అప్పటి యుపిఎ ప్రభుత్వం చట్టంలో ఎందుకు పొందుపరచలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీని ఎలా ఆదుకోవాలన్న విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్కు లేనేలేదని ఆయన వ్యాఖ్యానించారు.