S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెట్రో స్టేషన్లలో ఈ-బైక్‌లు

హైదరాబాద్, ఆగస్టు 4: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనున్న మెట్రోరైలు ప్రాజెక్టుకు అనుసంధానంగా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్ బైక్‌లు కూడా అందుబాటులో ఉండబోతున్నాయి.

గ్రేటర్‌లో లక్ష్యాన్ని మించి హరితహారం

హైదరాబాద్, ఆగస్టు 4: మహానగరంలో మానవ మనుగడ, పర్యావరణ పరిరక్షణ కోసం జిహెచ్‌ఎంసి రికార్డు స్థాయిలో మొక్కలు నాటేందుకు చేపట్టిన హరితహారం కార్యక్రమం లక్ష్యాన్ని దాటింది. జూలై 11వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే! సుమారు 125 ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్చంధ సంస్థలను భాగస్వాములను చేస్తూ ప్రారంభించిన ఒక్కరోజే సుమారు 25లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని జిహెచ్‌ఎంసి అదే రోజు ఛేదించింది.

స్టడీ సర్కిల్ విద్యార్థులకు మరో ఏడాది శిక్షణ ఇవ్వాలి

ఖైరతాబాద్, ఆగస్టు 4: సిలబస్ పూర్తికానందున తెలంగాణ అంబేద్కర్ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు మరో ఏడాది పాటు శిక్షణ ఇవ్వాలని జెఎసి చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలంటూ బంజారాహిల్స్‌లోని అంబేద్కర్ స్టడీ సెంటర్ విద్యార్థులు కొంత కాలంగా దీక్ష చేస్తున్నారు. గురువారం దీక్షా శిబిరాన్ని కోదండరామ్ సందర్శించారు. కోదండరామ్ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. ఆయన వచ్చేలోపే దీక్షను భగ్నం చేసి విద్యార్థులను అరెస్టు చేశారు.

తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలి

ఘట్‌కేసర్, ఆగష్టు 4: తల్లి దండ్రులు, గురువుల పట్ల గౌరవం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ప్రముఖ మానసిక నిపుణుడు బివి పట్ట్భారామ్ అన్నారు. మండల పరిధి ఘనపూర్ గ్రామంలోని కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఓరియేంటేషన్ కార్యక్రమం జరిగింది. నూతనంగా కళాశాలలో చేరిన విద్యార్థినీ విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రతి క్షణాన్ని నైపుణ్యతను సంపాదించేందకు వినియోగించాలన్నారు. తోటి విద్యార్థుల పట్ల సోదర భావంతో మెలిగితే మానసిక ప్రశాంతతతో పాటు ఉల్లాసంగా ఉంటారని పేర్కొన్నారు.

6న టిడిపి మహాధర్నా

ఖైరతాబాద్, ఆగస్టు 4: తెలంగాణ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 6న నగర టిడిపి ఆధ్వర్యంలో జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించనున్నట్టు టిఎన్ టియుసి అధ్యక్షుడు బిఎన్ రెడ్డి తెలిపారు. గురువారం ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అభిష్టాలకు విరుద్ధంగా పాలన కొనసాగుతుందని అన్నారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ నుంచి పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాల వరకు అన్నింటిని కెసిఆర్ విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు.

విద్యార్థులు సంకల్పంతో విద్యనభ్యసించాలి

జీడిమెట్ల, ఆగస్టు 4: విద్యార్థులు సంకల్పంతో విద్యనభ్యసించాలని విజ్యాన్ జ్యోతి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ డిఎన్ రావు సూచించారు. నగర శివారులోని బాచుపల్లి విఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఇండక్షన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న డిఎన్ రావు మాట్లాడుతూ ముందుగా నూతన విద్యార్థులకు స్వాగతం పలికారు. విద్యార్థులు శ్రమ, శ్రద్ధ, సహనంతో విద్యను అభ్యసించాలని అన్నారు. భావి ఉత్తమ ఇంజనీర్లుగా ఎదగడానికి విద్యార్థి దశలోనే బాటలు వేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు మంచి శిక్షణ అందించడంలో తమ కళాశాల ముందుంటుందని చెప్పారు.

ఎల్‌ఇడి వెలుగులు

హైదరాబాద్, ఆగస్టు 4: ప్రతి నెల కోట్లలో విద్యుత్ బిల్లులను చెల్లిస్తోన్న గ్రేటర్ హైదరాబాద్ ఇప్పటికే పొదుపు మంత్రాన్ని జపిస్తూ సుమారు 30 శాతాన్ని ఆదా చేసుకుంటున్న సంగతి తెలిసిందే! ఈ ఆదాను మరింత పెంచుకునేందుకు గాను జిహెచ్‌ఎంసికి చెందిన అన్ని కార్యాలయాల్లో త్వరలో ఎల్‌ఇడి లైట్లను వినియోగించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి నిర్ణయించారు. అయితే తొలి దశగా సర్కిల్ 10లో ప్రయోగాత్మకంగా ఈ ఎల్‌ఇడి లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన డిసిఎం

శామీర్‌పేట, ఆగస్టు 4: ఆగి ఉన్న లారీని డిసిఎం ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి తీవ్రగాయాలైన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కధనం ప్రకారం తూంకుంట శివారు దొంగల మైసమ్మ దగ్గరలోని డోమూస్ చౌరస్తా వద్ద పిబి 12 క్యూ 0935 నెంబర్ గల లారీ ఆగి ఉంది. మార్బుల్ లోడ్‌ను నింపుకొని కొంత మంది లేబర్లతో ఎల్‌బినగర్ నుండి సిరిసిల్లాకు వెళ్లుతున్న ఎపి 24 టిఎ 2507 నెంబర్ గల డిసిఎం డోమూస్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న లారీని బుధవారం అర్థరాత్రి ఢీకొట్టింది.

అధికారులు సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలి

శేరిలింగంపల్లి, ఆగస్టు 4: ప్రభుత్వ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జహెచ్‌ఎంసి వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ బివి గంగాధర్‌రెడ్డి ఆదేశించారు. శేరిలింగంపల్లి సర్కిల్ 11 కార్యాలయంలో డిప్యూటి కమిషనర్ వివి మనోహర్‌తో కలిసి జడ్‌సి గురువారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఒకరిపై మరొకరు చెప్పుకుంటూ సమస్యను జఠిలం చేయకుండా వెంటనే పరిష్కారం అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు జడ్‌సి సూచించారు. సమస్య ఎవరి దృష్టికి వచ్చినా సంబంధిత అధికారికి సమాచారం అందించి, ఆ పని పూర్తయ్యేలా చూడాలని అన్నారు.

నిర్విరామంగా కొనసాగుతున్న హరితహారం

హైదరాబాద్, ఆగస్టు 4: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో నిర్విరామంగా కొనసాగుతుందని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం తుర్కయాంజాల్ రిజర్వు ఫారెస్టు అటవీ శాఖ ఏర్పాటు చేసిన హరితహారంలో మంత్రి స్థానిక శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న తాండూరు, వికారాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో అటవీ శాఖ తరపున అధికంగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Pages