పరిష్కారం కాని వివాదాలు
Published Thursday, 4 August 2016పంధొమ్మిదవ శతాబ్దంలో ‘గెలివర్ ట్రావెల్స్’అనే నవల వచ్చింది. దానితో కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అది ఇంగ్లీషులో వుండడం వలన ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రాచుర్యాన్ని పొందింది. స్వాతంత్య్రానికి ముందు తరువాత కొంతకాలం మన దేశంలో హైస్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ విద్యార్థులకానవలను ఉపవాచకంగా పెట్టేవారు. దాని ప్రభావంతోనే కావచ్చును, పందొమ్మిదవ శతాబ్దం చివరలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు ‘వర్ధమానుని విదేశీయాత్రలు’ అనే నవల వ్రాసారు. అప్పట్లో, ఇది ఆంధ్ర దేశంలో మంచి ప్రాచుర్యాన్ని పొందింది.