మంజునాథ్ కమిషన్ ఎదుట బిసిల ఆందోళన
Published Saturday, 23 July 2016విజయవాడ, జూలై 22: కాపులను బిసిల్లో చేర్చవద్దంటూ స్థానిక మంజునాథ్ కమిషన్ ఎదుట పలు బిసి సంఘాలు శుక్రవారం ఆందోళన జరిపాయి. అమలాపురం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బిసి సంఘాలు శుక్రవారం విజయవాడ చేరుకున్నాయి. స్థానిక బెంజ్ సర్కిల్ దగ్గరున్న మంజునాథన్ కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశాయి. ఒక దశలో కార్యాలయంలోకి దూసుకువెళ్లడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తరువాత బిసి సంఘాల నాయకులు మంజునాథ కమిషన్ను కలిసి వినతిపత్రం సమర్పించాయి.