దక్షిణాది మార్కెట్లో అడుగుపెట్టిన స్కిప్పర్
Published Saturday, 23 July 2016హైదరాబాద్, జూలై 22: పాలిమర్ పైపుల ఉత్పత్తి రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన స్కిప్పర్ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా హైదరాబాద్లో పాలిమర్ పైపుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ డైరెక్టర్ దేవేష్ బన్సల్ తెలిపారు. మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారంలో 2.25 ఎకరాల విస్తీర్ణంలో ప్లంబింగ్, వ్యవసాయ పైపుల తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పామని, వంద మంది ఉద్యోగులను నియమించామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాలిమర్ పైపులను తయారు చేస్తామని, దేశీయ టెక్నాలజీతో ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు.