రాష్ట్ర ప్రత్యేక హోదాపై కెవిపి బిల్లుకు మద్దతిచ్చి చిత్తశుద్ధి చాటుకోండి
Published Friday, 22 July 2016తిరుపతి, జూలై 21: రాష్ట్రానికి ప్రత్యేక హోదాకావాలంటూ కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రారావురాజ్యసభలో శుక్రవారం ప్రవేశపెట్టనున్న ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇచ్చి బిజెపి, టిడిపి, వైసిపిలు తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రానికి ప్రత్యేక సాధన కల్పించాలంటూ కాంగ్రెస్ ఎంపి రామచంద్రరావు ప్రైవేటు బిల్లును ప్రవేశపెడుతున్న విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించి రాజ్యసభలో అన్ని పార్టీలు కెవిపి బిల్లుకు మద్దతివ్వాలని నినాదాలు చేశారు.