నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకుండా...వంశధార పనులా?
Published Tuesday, 19 July 2016శ్రీకాకుళం(టౌన్), జూలై 19: జిల్లాలోని వంశధార నిర్వాసితుల పునరావాసం వంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉండగా పనులు ప్రారంభించాలంటూ ఇంజనీరింగ్ అధికారులను రాష్ట్ర మంత్రి ఆదేశించడంలో అర్థం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.కృష్ణమూర్తి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సిటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేసి వారిని భయబ్రాంతులను గురిచేసే విధంగా ప్రశ్నించిన వారికి ప్రభుత్వ సత్తా చూపిస్తామని అనడం మంత్రి నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు.