భువనగిరి కోటకు రోప్ వే
Published Wednesday, 6 July 2016హైదరాబాద్, జూలై 5: భువనగిరి కోట వైభవాన్ని, నిర్మాణ శైలిని ప్రజలు సందర్శించడానికి త్వరలో రోప్ వే ఏర్పాటు చేయనున్నట్టు గిరిజనాభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ తెలిపారు. నెల రోజులలో రోప్ వే పనులను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. భువనగిరి కోటను పర్యాటకం, అడ్వంచర్ టూరిజంగా అభివృద్ధి చేయడానికి రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి అన్నారు. సచివాలయంలో మంగళవారం పర్యాటకాభివృద్ధి కోసం చేపట్టిన పనులను మంత్రి సమీక్షించారు. ఓరుగల్లు కోట, గోల్కొండ కోటకు మధ్యన ఉండే భువనగిరి కోటకు ఎంతో చారిత్రక ప్రశస్తి ఉందని మంత్రి అన్నారు.