కోహ్లీ దూకుడును అడ్డుకోను
Published Tuesday, 5 July 2016బెంగళూరు, జూలై 4: టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుకు తాను కళ్లెం వేయనని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. అయితే, భారత దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నామన్న విషయాన్ని ఆటగాళ్లంతా గుర్తుంచుకోవాలని, గీత దాటకూడదని కుంబ్లే హితవు పలికాడు. భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ టూర్కు బయలుదేరడానికి ముందు ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మైదానంలోకి దిగిన తర్వాత ఆటగాళ్లు దూకుడుగా వ్యవహరించడాన్ని తాను ఇష్టపడతానని అన్నాడు. క్రికెట్ ఆడే రోజుల్లో తాను కూడా అదే విధంగా ఉండేవాడినని చెప్పాడు.