S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహ్లీ దూకుడును అడ్డుకోను

బెంగళూరు, జూలై 4: టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుకు తాను కళ్లెం వేయనని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. అయితే, భారత దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నామన్న విషయాన్ని ఆటగాళ్లంతా గుర్తుంచుకోవాలని, గీత దాటకూడదని కుంబ్లే హితవు పలికాడు. భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ టూర్‌కు బయలుదేరడానికి ముందు ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మైదానంలోకి దిగిన తర్వాత ఆటగాళ్లు దూకుడుగా వ్యవహరించడాన్ని తాను ఇష్టపడతానని అన్నాడు. క్రికెట్ ఆడే రోజుల్లో తాను కూడా అదే విధంగా ఉండేవాడినని చెప్పాడు.

టెస్టుల్లో మా సత్తా త్వరలో తేలుతుంది

బెంగళూరు, జూలై 4: టెస్టులకు తాము ఎంత వరకు సమాయత్తమయ్యామో, తమ సత్తా ఏమిటో త్వరలోనే తేలుతుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు రానున్న కొద్దికాలంలో ఏకంగా 17 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ముందుగా వెస్టిండీస్ టూర్‌కు వెళ్లి, అక్కడ నాలుగు మ్యాచ్‌ల్లో పోటీపడుతుంది. టూర్‌కు వెళ్లే ముందు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ, టెస్టు ఫార్మెట్‌కు తాము ఎంత వరకూ సిద్ధమయ్యామన్నది ఈ టెస్టు మ్యాచ్‌ల కాలం స్పష్టం చేస్తుందని అన్నాడు. చాలా తక్కువ కాలంలో పదిహేడు టెస్టులు ఆడే అవకాశం అరుదుగా లభిస్తుందని చెప్పాడు.

కెనడా ఓపెన్ బాడ్మింటన్ టైటిల్ విజేత ప్రణీత్

కాల్గరీ (కెనడా), జూలై 4: భారత ఆటగాడు సాయి ప్రణీత్ ఇక్కడ జరిగిన కెనడా ఓపెన్ బాడ్మింటన్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో 23 ఏళ్ల ప్రణీత్ 21-12, 21-10 ఆధిక్యంతో దక్షిణ కొరియాకు చెందిన లీ హ్యున్‌ను ఓడించాడు. గతంలో పలువురు మేటి ఆటగాళ్లను ఓడించి సంచలనం సృష్టించిన ఈ హైదరాబాదీ నిరుడు శ్రీలంక ఇంటర్నేషనల్, లాగోస్ ఇంటర్నేషనల్, నజీబ్ రజాక్ ఓపెన్, బంగ్లాదేశ్ ఓపెన్ బాడ్మింటన్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది కెనడాలో తొలిసారి విజేతగా నిలిచాడు.

ప్రో కబడ్డీ టోర్నమెంట్ టైటాన్స్‌కు తొలి విజయం

హైదరాబాద్, జూలై 4: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో తెలుగు టైటాన్స్ తొలి విజయా న్ని నమోదు చేసింది. వరుసగా మూడు పరాజయాలను ఎదుర్కొన్న టైటాన్స్ సోమ వారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌ను ఏకంగా 17 పాయంట్ల తేడాతో చిత్తు చేసింది. టైటాన్స్ 35 పాయంట్లు సాధించగా, బెంగాల్ 18 పాయంట్లు మాత్రమే చేయ గలిగింది. మొదటి నుంచి చివరి వరకూ టైటాన్స్ ఆధిపత్యం కొనసాగడం విశేషం. కె ప్టెన్ రాహుల్ చౌదరి 10 పాయంట్లు సాధించి, టైటాన్స్ విజయంలో కీలక భూమిక పోషించాడు. సందీప్ ధుల్ ఎనిమిది పాయంట్లు చేశాడు. బెంగాల్ తరఫున ఎవరూ చె ప్పుకోద్గ పాయంట్లు రాబట్టలేకపోయారు.

గిరాడ్ డబుల్

పారిస్, జూలై 4: ఆలివర్ గిరాడ్ రెండు గోల్స్‌తో రాణించగా ఐస్‌లాండ్‌తో జరిగిన యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్‌లో 5-2 తేడాతో నెగ్గిన ఫ్రాన్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్

నరకానికి (రహ)దారులు

హైదరాబాద్ మహానగరంలోని రోడ్లు నరకాన్ని తలపింపజేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అడుగడుతునా ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు స్పీడ్ బ్రేకర్లతో నింపివేశారు. ఇక రోడ్లు ఎక్కడెక్కడ బాగుంటాయో ఎక్కడ గుంతల మయమై ఉంటాయో తెలియని పరిస్థితి. చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయమై ఈ నీళ్ళలో స్పీడ్ బ్రేకర్లు, గుంటలు అర్ధంకాక వాహనాలు పల్టీ గొట్టడంవంటి సంఘటనలు కోకొల్లలు. మరి ఈ సంవత్సరం మరిన్ని భారీ వర్షాలు పొంచి ఉన్నందున రోడ్లు మరెంత అధ్వాన్నంగా తయారవుతాయో, మరెన్ని ఇబ్బందులు తలెత్తుతాయో! అవసరమైనచోట్ల రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలి.

పనిచేస్తున్న ప్రభుత్వం

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారి కేంద్ర ప్రభుత్వం ఉరుకులు, పరుగులపై పని చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను కష్టపడి పని చేయటంతోపాటు మంత్రులు, అధికారుల చేత పని చేయిస్తున్నారు. దేశానికి ఇది శుభ పరిణామమని చెప్పకతప్పదు. నరేంద్ర మోదీ మంత్రుల పని తీరును ఎప్పటికప్పుడు సమీక్షించటంతోపాటు అధికారుల పని తీరును కూడా సమీక్షించటం హర్షణీయం. కేవలం అధికారులపై ఆధారపడి మంత్రులను గాలికి వదిలివేయకుండా ముందుకు సాగటం నరేంద్ర మోదీ పాలనా దక్షతకు నిదర్శమని చెప్పాలి. ఆయన హెడ్ మాస్టర్‌గా వ్యవహరించటంతోపాటు అంతా తానై చేస్తున్నారనే ఆరోపణ ఉన్నది. ఇందులో కొంత నజం లేకపోలేదు.

ప్రభుత్వ విద్యాసంస్థలు వెలవెల

తమ తప్పిదాలను ఇతరుల పైకి నెట్టివేసి, తాము సచ్చీలురమని చెప్పుకొనే సంస్కృతి సమాజంలో నానాటికి పెరిగిపోతున్నది. అంతే తప్ప, ఆత్మవిమర్శ చేసుకొని, జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించే నాథుడే కరవయ్యారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మన రాష్ట్రంలోని విద్యావ్యవస్థను చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో నానాటికీ విద్యారంగంలో ప్రైవేటు సంస్థల (కార్పొరేట్) ప్రాబల్యం పెరిగిపోతున్నది. దీనికి కారణం అటు ప్రభుత్వ విధానాలు ఇటు ఉపాధ్యాయ, అధ్యాపక వర్గాలే.

- పి.మస్తాన్‌రావు

ఉగ్రవాదుల గుప్పిట్లో ప్రపంచం

హైదరాబాద్ నగరం ఐసిస్ గుప్పెట్లోకి వెళ్లిందనే విషయం ఇవ్వాళ కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వచ్చిందని అనుకోవటం పొరపాటు. 2015వ సంవత్సరం నిక్కీ జోసఫ్ అనే ఐసిస్ ఉగ్రవాద నాయకురాలిని అరెస్టుచేసినప్పుడే ఈ విషయం బహిర్గతమయింది. ఇంటిలిజెన్స్ వర్గాలు హైదరాబాద్ పాతబస్తీలో ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్ సెంటర్ ఉందని హెచ్చరించినా కాంగ్రెసు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కారణం పాతబస్తీలోని ముప్పది లక్షల మంది ఓట్లు చేజారిపోతాయని భయం. 29 జూన్ 2016లో ఎన్‌ఐఎ- ఐ.జి. సంజీవ్‌కుమార్ ఐఎస్‌ఐ ఉగ్రవాదులను పట్టుకున్నారు. వీరి సంఖ్య 13. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఫైరింగ్ శిక్షణా శిబిరం ఉంది.

- ముదిగొండ శివ ప్రసాద్

నిర్లక్ష్యానికి మూల్యం!

వర్షాలు రాలేదన్న ఆందోళన ఎంత తీవ్రంగా యావద్భారతాన్ని కుదిపేస్తుందో..తీరా వర్షాలు పడితే దాని బీభత్సం కూడా అంతగానూ కకావికలం చేస్తుంది. చినుకు పడితే చాలు చిత్తడైపోయే రాష్ట్రాల్లో ప్రథమస్థానం ఉత్తరాఖండ్‌ది. ఇప్పుడా చిరు రాష్ట్రం తల్లడిల్లిపోతోంది. వర్షాలు లేక కాదు, కురిసిన వాన కుంభవృష్టిని తలపించడం వల్ల.. ఇలాంటి పరిస్థితి సంభవించే అవకాశం ఉందన్న హెచ్చరికలు అందినా అధికారులు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించడం వల్ల..! మూడేళ్లుగా నాలుగు ధామాల పుణ్యక్షేత్రాల పర్యాటక ప్రాంతమైన ఉత్తరాఖండ్ వరదల బీభత్సానికి కకావికలమైపోతోంది.

Pages