జడ్జీల నియామకాల్లో కేంద్రం ప్రతిపాదనకు ‘నో’ అన్న సుప్రీం
Published Monday, 4 July 2016న్యూఢిల్లీ, జూలై 3: న్యాయమూర్తులుగా పదోన్నతికోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల పేర్లను కొలీజియంకు పంపే ముందు ఆ దరఖాస్తులను పరిశీలించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.్ఠకూర్ తిరస్కరించారు. ఇందుకు సంబంధించి సవరించిన నిబంధనల ముసాయిదా (మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్)లోని క్లాజు పట్ల చీఫ్ జస్టిస్ ఠాకూర్ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.