అదనపు నిధుల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి
Published Sunday, 3 July 2016కర్నూలు ఓల్డ్సిటీ, జూలై 2 : గ్రామీ ణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కోసం కేంద్రం విడుదల చేసిన రూ. 50 కోట్ల నిధులను ఖర్చు చేసి, అవసరమైన అదనపు నిధుల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లిఫ్టు ఇరిగేషన్, తాగునీటి పథకాలు, ఉపాధి హామీ పనులు, చేతి పంపులు, సిసి రోడ్లు తదితర అంశాలపై ఆయన శనివారం హైదరాబాద్ నుంచి జిల్లాల వారీగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టక్కర్ మాట్లాడుతూ వచ్చే ఏడాదికి సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారు చేసి పంపాలని తెలిపారు.