అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..!
Published Sunday, 3 July 2016సంగారెడ్డి టౌన్, జూలై 2: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఒర్వలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో కాంగ్రెస్ నాయకుల కండ్లకు కనిపించడం లేదా అన్ని ప్రశ్నించారు. జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్కు సవాల్ విసిరారు. శనివారం టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, మంత్రులుగా పదవులు అనుభవించారు తప్పా చేసిన అభివృద్ధి ఎమిటో చూపించాలని డిమాండ్ చేశారు.