యాగంలా పల్స్ సర్వే
Published Sunday, 19 June 2016విజయవాడ, జూన్ 18: మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను నిజమైన లబ్ధిదారులకు చేర్చడం కోసమే స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇది ప్రజలందరి సంపూర్ణ వివరాలకోసం చేపడుతున్న సర్వే అని, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాబోదన్నారు. ప్రభుత్వం ఈనెల మూడవ వారంలో చేపట్టనున్న స్మార్ట్ పల్స్ సర్వేపై శనివారం మధ్యాహ్నం తన నివాసం నుంచి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భవిష్యత్లో ఆధార్ సంఖ్యలేని ప్రజలకు ప్రభుత్వపరంగా ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందబోవని సిఎం స్పష్టం చేశారు.