వర్సిటీలో అక్రమాలపై నేటి నుండి విచారణ
Published Friday, 17 June 2016నాగార్జున యూనివర్సిటీ, జూన్ 16: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వివిధ శాఖలలో అక్రమాలు జరిగాయని పత్రికలలో వచ్చిన కథనాలపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ గురువారం నుండి విచారణ చేపట్టనుంది. ఇష్టానుసారం జరిగిన సిబ్బంది నియమకాలు, అనర్హులకు పదోన్నతులు కల్పించటం వంటి పలు అక్రమాలపై పలు కథనాలు రావటంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. దీనిపై రాష్ట్ర కళాశాల, సాంకేతిక శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. వర్సిటీలో జరిగిన అక్రమాలపై వర్సిటీలో వచ్చిన కథనాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు.