భారత్లో పెట్టుబడులపై జపాన్ ఆసక్తి
Published Monday, 30 May 2016టోక్యో, మే 29: భారతీయ వౌలికరంగాభివృద్ధిని జపాన్ మదుపరులు దగ్గరగా గమనిస్తున్నారని, ఈ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారని, భారత్లోని వివిధ రంగాల్లో పెట్టుబడులతో వస్తామని చెబుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం జపాన్కు చేరిన జైట్లీ.. అక్కడ జపాన్ బహుళవ్యాపారరంగ సంస్థ సాఫ్ట్బ్యాంక్ సిఇఒ మసయోషి సన్తో సమావేశమయ్యారు. ఆసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ నుంచి భారత్లోకి భారీగా పెట్టుబడులను పట్టుకురావడమే లక్ష్యంగా జైట్లీ ఈ పర్యటనను చేస్తున్నారు.