మారండి..బాగుపడండి
Published Saturday, 28 May 2016హైదరాబాద్, మే 27: పేద, బడుగు వర్గాల ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసే గుడుంబా తయారీని మానుకుని, మీ అంత మీరే మీలో మార్పు తెచ్చుకుని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ధూల్పేట వాసులకు హితవు పలికింది ధూల్పేట పునరావాస కమిటీ. కలెక్టర్ రాహుల్ బొజ్జ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం జరిగింది. పోలీసులు, ఎక్సైజ్ శాఖల అధికారులతో పాటు జియాగూడ, కార్వాన్, మంగల్హాట్, గోషామహల్ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు కూడా పాల్గొని ధూల్పేట అభివృద్ధిపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.