విద్యుత్ షాక్తో రైతు మృతి
Published Monday, 16 May 2016పెగడపల్లి, మే 15: పెగడపల్లి మండలం బతికపెల్లి గ్రామానికి చెందిన మండ నర్సయ్య(65) అనే రైతు ఆదివారం విద్యుత్ఘాతంతో మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నర్సయ్య గ్రామసమీపంలోని తన వ్యవసాయ పొలంలో ఉన్న చెట్లను కొట్టివేసేందుకు ఇంటి నుండి వెళ్లాడు. చెట్టును కొడుతున్న సమయంలో నర్సయ్యకు దాహం వేయ్యడంతో తన పొలం పక్కనే ఉన్న లింగాపూర్ గ్రామానికి చెందిన గజ్జి తిరుపతి అనే రైతు వ్యవసాయ బావి వద్దకు నీరు తాగడానికి వెళ్లాడు. నీరు తాగడం కోసం విద్యుత్ మోటార్ను స్టాట్ చేయగా స్టాటర్ డబ్బా వల్ల షాక్ తగలడంతో నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.