చేయి చాచలేను.. బిచ్చమెత్తలేను
Published Sunday, 15 May 2016న్యూఢిల్లీ, మే14: ‘నేను జాతిపిత మహాత్మా గాంధీ మనుమడిని, తల దాచుకునేందుకు ఒక ఇంటికోసం వెతుకుతున్నాను, సహాయంకోసం ప్రభుత్వాన్ని లేదా ఇతరులను చేయిచాచి అడగలేను, బిచ్చమెత్తలేను’ అని మహాత్మా గాంధీ మనుమడు కనుభాయి రాందాస్ గాంధీ (87) చెబుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీ తనంత తాను ముందుకు వచ్చి ఏదైనా సహాయం చేస్తే తీసుకుంటాను లేకపోతే ఇలాగే ఈ ఆశ్రమంలోనే ఉంటామని ఆయన అంటున్నారు. కనుభాయి రాందాస్ గాంధీ, ఆయన భార్య శివలక్ష్మి గాంధీ (85) ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని గురువిశ్రాం వృద్ధాశ్రమంలో తలదాచుకుంటున్నారు.