వైకాపా నేతలకు తెలంగాణ ప్రాజెక్టు పనులా?
Published Tuesday, 3 May 2016హైదరాబాద్, మే 2: తెలంగాణలో ప్రాజెక్టు పనులను వైకాపా నేతలకు అప్పగించడంతో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, వైఎస్ఆర్సిపి అధినేత జగన్ల నాటకం ప్రజల ముందు బట్టబయలైందని టిటిడిపి వర్గింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి విమర్శించారు. వైకాపా పార్టీ నేతలకు వేల కోట్ల ప్రాజెక్టు పనులు అప్పగించి, మరోవైపు ఆంధ్రావాళ్లు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ హరీశ్రావు ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.