S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కుదేలైన కర్నాటక
Published Tuesday, 14 April 2020బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీసిందని కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్డియూరప్ప ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మార్గాలు అనే్వషిస్తున్నట్టు సోమవారం ఇక్కడ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు వారాల లాక్డౌన్ మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల కోసం తాము వేచిచూస్తున్నట్టు సీఎం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన తరవాతే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మినహాయించాలా వద్ద అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
రెండు వారాలుగా కొత్త కేసుల్లేవు
Published Tuesday, 14 April 2020న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డౌన్ వల్ల కరోనా వైరస్ అదుపులోకి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్తగా ఎలాంటి కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. జిల్లా పాలనా యంత్రాంగాలు అత్యంత కఠినంగా లాక్ డౌన్ను అమలు చేయడం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన గత 24 గంటల్లో 796 కోవిడ్-19 కేసులు కొత్తగా వెలుగులోకి వచ్చాయని, 35 మంది మరణించారని తెలిపారు.
ఉత్పత్తి తగ్గించిన ఓఎన్జీసీ
Published Tuesday, 14 April 2020న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో 15 శాతం కోత విధించింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సప్లయర్లు కొనుగోళ్లను తగ్గించుకోవడంతో ఓఎన్జీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల 25వ తేదీన దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను విధించక ముందు ఓఎన్జీసీ రోజుకు 64.3 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ను ఉత్పత్తి చేసేది. అయితే, గ్యాస్ అమ్మకాలు 40 నుంచి 50 మిలియన్ క్యూబిక్ మీటర్ల మేర తగ్గడంతో, తదనుగుణంగా ఉత్పత్తిని ఓఎన్జీసీ తగ్గించింది.
సాయం అందించండి
Published Tuesday, 14 April 2020న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కరోనా వైరస్ కారణంగా అతలాకుతలమైన ఆటో మొబైల్ రంగాన్ని ఆదుకోవడానికి తక్షణ సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (్ఫడా) కోరింది. ఈ మహమ్మారి కారణంగా మొత్తం పరిశ్రమ కుదేలైందని పేర్కొంది. లాక్డౌన్తో ఉత్పత్తి, రవాణా, అమ్మకాలు నిలిచిపోయాయని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన మొత్తాలపై వడ్డీని పూర్తిగా రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా సుమారు 15,000 ఆటో డీలర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న ‘్ఫడా’ కోరింది. అంతేగాక, వర్కింగ్ కేపిటల్ కింద నాలుగు శాతం వడ్డీకి రుణాలను ఇప్పంచాలని సూచించింది.
వీసా, ఈ - వీసాల గడువు పెంపు
Published Tuesday, 14 April 2020న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులకు వీసా, ఈ-వీసా పరిమితి గడువును పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు సోమవారం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇటీవల భారత్ వచ్చిన పలువురు విదేశీయులు తిరిగి తమ స్వదేశాలకు వెళ్లేందుకు గడువు తీరిపోతే, అలాంటి వారికి ఈనెల 30వరకు వీసా, ఈ-వీసా గడువును పొడిగించింది. కోవిడ్-19 వల్ల ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 30 అర్ధరాత్రి వరకు గడువు కలిగిన విదేశీయుల వీసా, ఈ-వీసా గడువు కాలపరిమితిని ఏప్రిల్ 30వరకు పొడిగించింది.
ఢిల్లీలో స్వల్ప భూకంపం
Published Tuesday, 14 April 2020న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు తల్లడిల్లుతుంటే సోమవారం ఢిల్లీ ప్రజలను భూకంపం వణికించింది. అయితే భూకంపం తీవ్రత (2.7) స్వల్పంగా ఉండడంతో ఆస్తి, ప్రాణ నష్టమేమీ జరగలేదు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. 24 గంటల్లో ఇది రెండోసారి. ఈశాన్య ఢిల్లీలోని వాజిపూర్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 1.26 గంటలకు భూమి కంపించినట్లు ఎన్సీఎస్ ఆపరేషన్స్ ప్రధాన అధికారి జేఎల్ గౌతం తెలిపారు. ఆదివారం కూడా భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు పరుగెత్తుకుని వచ్చారు.
కరోనా అవగాహనా యాప్ ఆరోగ్య సేతు
Published Tuesday, 14 April 2020కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ భయంకరమైన వైరస్ ఎప్పుడు, ఎలా ఎటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి.. మన చుట్టుపక్కల ఉన్నవారిలో ఎవరికి వైరస్ ఉందో తెలుసుకోవడం కూడా కష్టం. భారతదేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఏప్రిల్ 2 నాటికి 1964 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 50 మంది మరణించారు. కాగా.. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకువచ్చింది. దీని పేరు ‘ఆరోగ్య సేతు’. ప్రైవేటు భాగస్వామ్యంతో కేవలం 4 రోజుల్లోనే దీన్ని డిజైన్ చేశారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ బాధితుల వివరాలు ఇందులో ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తుంటారు. ఇది కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్.
కలహాల ‘మండలి’
Published Tuesday, 14 April 2020మానవ చరిత్రలో ఓ మహా ఉపద్రవం కోవిడ్-19 అనే ప్రాణాంతక మహమ్మారి యావత్ ప్రపంచం అభివృద్ధి పరుగులు పెడుతున్న తరుణంలో ఓ పెను విలయంగా ఈ వైరస్ విశ్వాన్ని చుట్టుముట్టింది. 200కు పైగా దేశాలకు అవహించడంతో పాటు 10 లక్షల మందికి పైగా మరణించడానికి దారి తీసింది. ఇది విలయమా? విపత్తా? మానవ తప్పిదమా? ఉద్దేశపూర్వక ప్రయత్నమా? అన్న మీమాంసను పక్కన పెడితే యావత్ మానవాళి మనుగడను ముప్పుముంగిళ్ళకు నెట్టేసిన మృత్యు విలయతాండవం ఇది. ఇలాంటి మహా విపత్తులను ఎన్నింటినో మానవాళి ఎదుర్కొన్న సవాళ్ళన్నింటికీ ఎన్నో రేట్ల తీవ్రతతో అనూహ్య వేగంతో ఈ వైరస్ కబళిస్తోంది.
సమష్టి కృషికి సమారాధన
Published Tuesday, 14 April 2020సమష్టిగా కృషి చేస్తే సత్ఫలితాలు ఉంటాయనేది మరోసారి రుజువైంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఒక లక్షా పదిహేను వేలమందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ మహమ్మారిని నిలువరించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమిష్టిగా చేస్తున్న కృషి ఇందుకు తాజా ఉదాహరణ. ప్రధాన మంత్రి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుక్షణం పరిస్థితిని సమీక్షిస్తూ లాక్ డౌన్ వంటి కఠిన నిర్ణయాలతో కరోనావైరస్ను అదుపు చేయటంలో గణనీయమైన విజయం సాధించారు. పార్టీ రాజకీయాలను పక్కన పెట్టి దేశం, ప్రజల పట్ల తమకున్న బాధ్యతకు పెద్ద పీట వేయటం ద్వారా కరోనా వైరస్ విస్తరణను అదుపు చేయగలుగుతున్నారు.